కుక్కునూరు ఏజెన్సీలో మావోయిస్టుల లేఖల కలకలం
ABN , First Publish Date - 2021-07-17T03:39:21+05:30 IST
జిల్లాలోని కుక్కునూరు మండలంలో గల ఏజెన్సీలో మావోయిస్టుల లేఖలు కలకలం
పశ్చిమ గోదావరి: జిల్లాలోని కుక్కునూరు మండలంలో గల ఏజెన్సీలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టించాయి. అమరవరం గ్రామ సచివాలయం నోటీస్ బోర్డుపై సీపీఐ (మావోయిస్ట్)పార్టీ పేరిట కట్టిన ఎర్ర బ్యానర్పై నాలుగు లేఖలు ప్రత్యక్షమయ్యాయి. పోలవరం ప్రాజెక్టుకు భూములు ఇచ్చి పరిహారం పొందిన భూముల్లో ఇంకా సాగుచేస్తున్న గిరిజనులు, దాడులు చేయిస్తున్న వైసీపీ నాయకుల్లారా ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దౌర్జన్యం ఆపకపోతే గతంలో బంజరగూడెంలో రామిరెడ్డికి పట్టినగతే పడుతుందని లేఖల్లో హెచ్చరించారు.