ముగిసిన గ్రంథాలయ వేసవి శిబిరం
ABN , First Publish Date - 2022-07-01T04:30:49+05:30 IST
ఇందుకూరుపేట గ్రంఽథాలయంలో వేసవిలో ప్రత్యేకంగా విద్యార్థులకు 40రోజులపాటు నిర్వహించిన శిబిరం గురువారం ముగిసింది.
ఇందుకూరుపేట, జూన్ 30 : ఇందుకూరుపేట గ్రంఽథాలయంలో వేసవిలో ప్రత్యేకంగా విద్యార్థులకు 40రోజులపాటు నిర్వహించిన శిబిరం గురువారం ముగిసింది. కథలు, కవితలు రా యడం, చెప్పడం, తెలుగు సాహిత్యం సామెతలు గ్రామీణ ఆటలు, జానపద గీతాలు చిత్రలేఖనం లాంటి దాదాపు 20 అంశాలపై సాహితీవేత్తలు, కళాకారులచే విద్యార్థులకు తరగ తులు నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న 50 మంది విద్యార్థులకు చివరి రెండు రోజులు వి విధ విభాగాల వారీగా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అఽధికారి సుజాత మాట్లాడుతూవిద్యార్ధులలో వేసవి లో వృథాగా కాలం గడిచిపోకుండా వారిలో సృజనాత్మక కళలు పెంపొందించే ప్రక్రియలో భాగంగా శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. పాల్గొన్న అందరికీ టిఫిన్ కిట్లు, విజేతలకు బహుమతులను నిర్వాహకులు అందజేశారు. కార్య క్రమంలో సాహి తీ వేత్త తిప్పావద్దుల సుబ్రహ్మణ్యం, నీరికట్టు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొ న్నారు.