గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంపొందించే కేంద్రాలు

ABN , First Publish Date - 2022-06-29T05:19:26+05:30 IST

గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంపొందించే కేంద్రాలని రామాపురం సర్పంచుల సంఘం అధ్యక్షుడు అయోధ్యాపురం నాగభూషణ్‌రెడ్డి తెలిపారు.

గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంపొందించే కేంద్రాలు
బహుమతి ప్రదానం చేస్తున్న అయోధ్యాపురం నాగభూషణ్‌రెడ్డి

రామాపురం, జూన్‌ 28: గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంపొందించే కేంద్రాలని రామాపురం సర్పంచుల సంఘం అధ్యక్షుడు అయోధ్యాపురం నాగభూషణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం రామా పురంలోని శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రంథాలయా ధికారి సూర్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర హైస్కూ ల్‌ కరస్పాండెంట్‌ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పెనగలూరు: పెనగలూరు శాఖ గ్రంఽథాలయం లో  నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం మంగళ వారం బహుమతి ప్రదానోత్సవంతో ముగిసినట్లు లైబ్రేరియన్‌ సుధాకర్‌ తెలిపారు. పుస్తకపఠనంలో టి.సత్య ప్రథమ, ఎన్‌.నిఖిత ద్వితీయ, ఎస్‌. సాదియభాను తృతీయ బహుమతులందుకున్నా రు. ముగింపు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. యల్లయ్య, పి.నరసింహులు, కె.నారాయణ గ్రామ పెద్దలు యు.వి.రమణారెడ్డి, బి.రామచంద్రారెడ్డి, ఎన్‌.చంద్రమోహన్‌ పాల్గొన్నారు. నిత్యం వేసవి శిక్షణ శిబిరానికి హాజరైన 30 మంది విద్యార్థులకు బహుమతులందజేసినట్లు వివరించారు. 

Updated Date - 2022-06-29T05:19:26+05:30 IST