గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-24T07:12:35+05:30 IST

నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవా లని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్‌ రాజు అన్నారు.

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
రికార్డులు పరిశీలిస్తున్న కుమార్‌రాజు

జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి కుమార్‌ రాజు

ఉలవపాడు, అక్టోబరు 23 : నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవా లని  జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్‌ రాజు అన్నారు. మండల కేంద్రం ఉలవపాడులోని శాఖా గ్రంథాలయాన్ని ఆయన శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామం నడిబొడ్డున అందరికీ అందుబాటులో నూతన భవనంలో గ్రంథాలయం ఉండడం పాఠకులకు ఆసక్తిదాయక మన్నారు.  ర్యాక్‌లలో క్రమపద్దతిలో అమర్చి ఉన్న పుస్తకాలను పరిశీలించారు. మెరుగైన సేవలందిస్తున్న గ్రంథపాలకుడు దాసరి కోటేశ్వరరావును అభినందించారు. అనంతరం శాఖాపరమైన వివిధ రిజిస్టర్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-24T07:12:35+05:30 IST