మూడోసారి బీమా గ్రామంగా కారేపల్లి

ABN , First Publish Date - 2021-03-09T05:18:20+05:30 IST

బీమా గ్రామంగా మండల కేంద్రమైనా కారేపల్లి గ్రామం మూడోసారి ఎంపికైంది.

మూడోసారి బీమా గ్రామంగా కారేపల్లి
చెక్‌ అందచేస్తున్న ఎల్‌ఐసి బ్రాంచి మేనేజర్‌

 రూ.లక్ష చెక్‌ అందజేస్తున్న ఎల్‌ఐసీ

కారేపల్లి మార్చి 8: బీమా గ్రామంగా మండల కేంద్రమైనా కారేపల్లి గ్రామం మూడోసారి ఎంపికైంది. భారతీయ జీవిత బీమా సంస్థ  (ఎల్‌ఐసీ) కారేపల్లి గ్రామఅభివృద్ధికి రూ.లక్ష చెక్కును అందజేసింది. సోమవారం పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎల్‌ఐసీ ఇల్లెందు బ్రాంచ్‌ మేనేజర్‌ ఆర్‌. విద్యాసారగ్‌, డెవలప్‌మెంట్‌ అధికారి సి.శ్రీనివాస్‌, ఏజెంట్‌ ఇందూర్తి సురేందర్‌ రెడ్డి, చెక్కును గ్రామ ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌ లక్ష్మీబాయికి అందచేశారు. కార్యక్రమంలో గ్రామకార్యదర్శి మేహారాజ్‌ ఉద్దీన్‌, గ్రామస్థులు ఎర్ర నర్సింహరావు, సురేందర్‌ మనియార్‌, రామచంద్రమూర్తి, గుడెల్లి శ్రీనివాస్‌, బాణోత్‌ రాములు,అదెర్ల రాములు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-09T05:18:20+05:30 IST