ఆక్వా రైతులకు లైసెన్స్ తప్పనిసరి
ABN , First Publish Date - 2021-04-24T04:55:56+05:30 IST
ఆక్వా రైతులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని కొవ్వూరు డివిజన్ మత్య్సశాఖ ఏడీ బి.సైదా నాయక్ అన్నారు.
కొవ్వూరు, ఏప్రిల్ 23: ఆక్వా రైతులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని కొవ్వూరు డివిజన్ మత్య్సశాఖ ఏడీ బి.సైదా నాయక్ అన్నారు. సుస్థిర ఆక్వాసాగు అభివృద్ధికి మండల కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. తహసీల్దార్ బి.నాగరాజు నాయక్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ యాక్టు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆక్వా కల్చర్, ఫిష్ సీడ్, ఫిష్ ఫీడ్ చట్టాలపై అవగాహన కల్పించారు. మత్య్సశాఖ ఏడీ సైదా నాయక్ మాట్లాడుతూ ఆక్వా రైతులు, చేపలు, రొయ్యల మేతల తయారీదారులు, అమ్మకం దారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా రైతులు తమ లైసెన్స్లను పొందవచ్చన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కె.వేణుగోపాలకృష్ణ, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎం.జయలక్ష్మి, ఫారెస్టు రేంజర్ దావీజురాజు, మత్యశాఖ సహాయ తనిఖీ అధికారి వి.దేవానంద్, ఇరిగేషన్ ఏఈ కొండలరావు, టి.చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.