మద్యం అక్రమ రవాణాలో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-12-04T03:52:34+05:30 IST

ఇతర రాష్ర్టాల నుంచి మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో నిందితుడ్ని గురువారం బుచ్చి స్పెషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.

మద్యం అక్రమ రవాణాలో నిందితుడి అరెస్టు

బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 3: ఇతర రాష్ర్టాల నుంచి మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో నిందితుడ్ని గురువారం బుచ్చి స్పెషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అక్టోబరు 26న చెన్నై నుంచి కారులో  మద్యం అక్రమంగా తరలిస్తుండగా బుచ్చిరెడ్డిపాళెంలో దాడిచేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో నిందితుడు పరార్‌ కాగా, కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ ప్రసన్నలక్ష్మి తెలిపారు. నిందితుడు మహానంది గోపాల్‌రెడ్డి అప్పటి నుంచి పరారీలో ఉండగా గురువారం బుచ్చిరెడ్డిపాళెంలోని బృందావనం అపార్ట్‌మెంట్‌ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. అనంతరం కోర్టుకు హాజరుపర్చగా, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో సెబ్‌, ఎక్సైజ్‌ ఎస్‌ఐ డి.శ్రీధర్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T03:52:34+05:30 IST