Ts: దంపతుల హత్య కేసులో జీవిత ఖైదు
ABN , First Publish Date - 2022-07-22T11:54:58+05:30 IST
దంపతుల హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిదర్రెడ్డి గురువారం తీర్పు చెప్పారు..
సంగారెడ్డి: దంపతుల హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిదర్రెడ్డి గురువారం తీర్పు చెప్పారు. నారాయణఖేడ్ మండలం సత్యగామ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బాయిని అంబయ్య, బాయిని సుశీలను 2016 ఆగస్టు 13వ తేదీన అదే గ్రామానికి చెందిన ఉబిడి సురేష్(27) అతి దారుణంగా హత్య చేసి, వారి ఒంటిపై ఉన్న నగలను ఎత్తుకెళ్లాడు. నారాయణఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో సురే్షకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.వెయ్యఇ జరిమానా విధిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిదర్రెడ్డి గురువారం తీర్పుచెప్పారు.