Guntur: హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
ABN , First Publish Date - 2022-10-01T12:27:41+05:30 IST
గదు, బంగారం కోసం ఓ వృద్ధుడిని హతమార్చినట్టు నేరం రుజువవ్వటంతో నిందితులు నాదెండ్ల గ్రామానికి చెందిన కొరివి అశోక్కుమార్, ఒడివా రాష్ట్రానికి చెందిన దిబ్రా బాలులకు
గుంటూరు: నగదు, బంగారం కోసం ఓ వృద్ధుడిని హతమార్చినట్టు నేరం రుజువవ్వటంతో నిందితులు నాదెండ్ల గ్రామానికి చెందిన కొరివి అశోక్కుమార్, ఒడివా రాష్ట్రానికి చెందిన దిబ్రా బాలులకు జీవిత ఖైదు, రూ.2వేలు జరిమానా విధిస్తూ స్థానిక 13వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఓవీ నాగేశ్వరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. నాదెండ్ల గ్రామానికి చెందిన కొనగండ్ల నారాయణ 2021 మే 6న బహిర్భూమికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన అశోక్కుమార్, బాలు అతనిని అనుసరించారు. గతంలో ముగ్గురికీ పరిచయం ఉండడంతో అక్కడ మద్యం సేవించారు. అనంతరం నారాయణను చంపి అతని వద్ద ఉన్న రెండు బంగారు ఉంగరాలు, రూ.8నగలు దోచుకున్నారు. తర్వాత మృతదేహాన్ని తగులబెట్టారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టుచేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువవ్వటంతో పై విధంగా కోర్టు తీర్పు వెలువడింది.