సహస్ర దీపాలంకరణ సేవ

ABN , First Publish Date - 2021-03-02T06:05:52+05:30 IST

శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు సోమవారం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు.

సహస్ర దీపాలంకరణ సేవ
సహస్ర దీపాలంకరణలో అర్చకులు

 శ్రీశైలం, మార్చి 1: శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు సోమవారం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి వేదికపై ఆశీనులను చేసి అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో పూజలు చేశారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. పరిమిత సంఖ్యలో అర్చకులు, వేదపండితులు భౌతిక దూరాన్ని పాటిస్తూ పూజా కార్యక్రమాన్ని జరిపారు.


Updated Date - 2021-03-02T06:05:52+05:30 IST