మత్య్సకారుల సంఘం మండల అధ్యక్షుడిగా లింగం
ABN , First Publish Date - 2022-09-26T05:52:08+05:30 IST
మత్య్సకారుల సంఘం మండల అధ్యక్షుడిగా లింగం
కందుకూరు సెప్టెంబరు25 : మత్య్సకారుల సంఘం కందుకూరు మండల అధ్యక్షుడిగా బేగంపేట గ్రామానికి చెందిన పులగాజు లింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం అధికారప్రతినిధులు కె.శ్రీనివాస్, ఎడ్లబాబురావ్ ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన సమావేశం అనంతరం వారు మాట్లాడారు. సంఘం ఉపాధ్యక్షుడిగా ఎం.బాల్రాజ్, ప్రధానకార్యదర్శిగా పి.శ్రీనివాస్, డైరెక్టర్లుగా అజయ్, మహేందర్, అనీల్, శ్రీనివాస్, శేఖర్, సుఽధాకర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాకి రాములు, జంగయ్య, వెంకటేష్, సుదర్శన్, ఉదయ్కుమార్, శ్రీరాములు, కేశవులు శ్రీనివాస్, రాజు, శివ, శ్రీశైలం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.