తెలంగాణ మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-03-08T06:12:24+05:30 IST
తెలంగాణా రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 70 వేల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్ విలేకరులకు తెలిపారు.
కొవ్వూరు, మార్చి 7: తెలంగాణా రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 70 వేల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్ విలేకరులకు తెలిపారు. కొవ్వూరు గోదావరిమాత విగ్రహం వద్ద ఆదివారం పట్టణ సీఐ మూర్తి, ఎస్ఐలు కె.వెంకటరమణ,పి.రవీంద్రబాబులు వాహన తనిఖీలు చేపట్టగా ఈ తనిఖీల్లో మద్యం బయటపడింది. మద్యం, వ్యాను, కారు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.