గుండె నిండా ప్రేమే ఊపిరి ఆపేసింది.. భర్త మరణించిన 20 నిమిషాలకే ఆ భార్య కూడా..

ABN , First Publish Date - 2021-12-27T23:19:07+05:30 IST

ఆ భార్యకు భర్త అంటే గుండె నిండా ప్రేమే.. భర్త లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. ఎప్పుడు ఇద్దరూ

గుండె నిండా ప్రేమే ఊపిరి ఆపేసింది.. భర్త మరణించిన 20 నిమిషాలకే ఆ భార్య కూడా..

రాజస్థాన్: ఆ భార్యకు భర్త అంటే గుండె నిండా ప్రేమే.. భర్త లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. ఎప్పుడు  ఇద్దరూ అందుకే భర్త మరణించిన 20 నిమిషాలకే ఆ భార్య కూడా ఊపిరి పీల్చుకోవడం ఆపేసింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..


చౌము ప్రాంతానికి చెందిన 85 ఏళ్ల సీతారాం శర్మకు 83 ఏళ్ల భన్వరిదేవితో 60 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గతంలో సీతారాం భార్యతో కలిసి సిటీలో ఉంటూ పనిచేసేవాడు. అయితే వయసు మీద పడిన తర్వాత ఆ దంపతులు తిరిగి స్వగ్రామానికి వచ్చి ఉంటున్నారు. కొద్ది రోజులుగా సీతారాం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భర్త త్వరగా కోలుకోవాలని ఆ వృద్ధురాలు ఎన్నో సపర్యలు చేసింది. కానీ సీతారాం సోమవారం ఉదయం చనిపోయాడు. 60 ఏళ్లుగా ఒకరికిఒకరుగా బతికిన ఆ భర్తను విగతజీవిగా చూసి భన్వరిదేవి తట్టుకోలేకపోయింది. భర్త చనిపోయిన 20 నిమిషాలకే ఆమె కూడా ఊపిరి పీల్చుకోవడం ఆపేసింది. 


గంట వ్యవధిలోనే తల్లిదండ్రులు మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ వృద్ధ దంపతుల మరణవార్త తెలిసి గ్రామంలోని వారంతా తరలివచ్చారు. వృద్ధాప్యంలో కూడా వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండేవారని.. ఆ దంపతుల జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడరు. మరణాన్ని కూడా కలిసి పంచుకున్న ఆ వృద్ధ దంపతులను ఒకే చితిపై దహనం చేశారు. 

Updated Date - 2021-12-27T23:19:07+05:30 IST