Rajasthan: రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు ధ్వంసం.. ఎవరు చేశారో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ చూసిన యజమానికి షాక్..!

ABN , First Publish Date - 2022-08-09T20:40:24+05:30 IST

ఆ వ్యక్తి తన కారును ఆఫీస్ ఎదురుగా ఉన్న రోడ్డుపై పార్క్ చేశాడు..

Rajasthan: రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు ధ్వంసం.. ఎవరు చేశారో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ చూసిన యజమానికి షాక్..!

ఆ వ్యక్తి తన కారును ఆఫీస్ ఎదురుగా ఉన్న రోడ్డుపై పార్క్ చేశాడు.. సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు కారు డోరు తెరవగా లోపల ఉన్న వైరింగ్, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయిన స్థితిలో కనిపించాయి. ఎవరో తన కారును ధ్వంసం చేశారని ఆ వ్యక్తి భావించాడు. దగ్గర్లో ఉన్న ఓ దుకాణంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాడు. వీడియోలో కారుపై పిడుగు పడినట్లు (Thunder Fall On Car) కనిపించింది. పిడుగుపాటుకు సంబంధించిన మొత్తం దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ సమయంలో కారు లోపల ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌ (Rajasthan)లోని ఉదయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

`నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను..` అంటూ లేఖ రాసిన ఓ యువకుడు ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే..


ఉదయ్‌పూర్‌కు చెందిన రవాణా వ్యాపారి దుంగార్ సింగ్ ఝాలా ఆదివారం మధ్యాహ్నం తన ఆఫీస్ పక్కన కారు పార్క్ చేశాడు. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ఇంటికి వెళ్లేందుకు కారు స్టార్ట్ చేశాడు. కారు స్టార్ట్ కాలేదు. కారు లోపల వైర్లు కాలుతున్న వాసన వచ్చింది. ఎవరో తన కారును పాడు చేశారని భావించి సమీపంలోని దుకాణంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని చూశాడు.ఫుటేజీలో కారుపై పిడుగు పడినట్లు కనిపించింది. పిడుగు పాటుకు కారులోని కారు వైరింగ్, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతిన్నాయి. కారు బాడీకి, మిగిలన భాగాలకు నష్టం జరగలేదు. పిడుగు పడినప్పుడు కారులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

Updated Date - 2022-08-09T20:40:24+05:30 IST