పశువుల సంత ఆదాయం రూ.2.56 లక్షలు
ABN , First Publish Date - 2021-04-19T06:14:01+05:30 IST
అనంత వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న పశువుల సంత ద్వారా మార్కెట్కు రూ.2.56లక్షల ఆదాయం వచ్చింది.
అనంతపురంరూరల్, ఏప్రిల్18: అనంత వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న పశువుల సంత ద్వారా మార్కెట్కు రూ.2.56లక్షల ఆదాయం వచ్చింది. శనివారం నిర్వహించిన గొర్రెలు, మేకల సంతద్వారా మార్కెట్కు రూ.1,66,430, ఆది వారం నిర్వహించిన ఎనుములు, ఆవులు, ఎద్దుల సంతతో రూ.90,200 ఆదాయం వచ్చింది. మొత్తంగా రెండురోజుల్లో మార్కెట్కు రూ.2,56,630 ఆదాయం వచ్చినట్లు మార్కెట్ యార్డు ఎంపికశ్రేణి కార్యదర్శి పరమేశ్వర్ తెలిపారు.