రుణాలు సకాలంలో చెల్లించాలి

ABN , First Publish Date - 2022-05-13T05:06:45+05:30 IST

తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని ఆది లాబాద్‌ జిల్లా సహకార కేంద్రబ్యాంకు మేనేజర్‌ మేస్రం కోశారావు పేటల్‌ అన్నారు. గురువారం మండలంలోని ధనోర ఆదివాసీ గ్రామంలో ఆర్థిక అక్షరా స్యతపై నాబార్డు సౌజన్యంతో ఆవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాలన్నారు.

రుణాలు సకాలంలో చెల్లించాలి
మాట్లాడుతున్న జైనూర్‌ ఏడీసీసీ మేనేజర్‌ మెస్రం కోశారావు పటేల్‌

సిర్పూర్‌(యూ),మే 12: తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని ఆది లాబాద్‌ జిల్లా సహకార కేంద్రబ్యాంకు మేనేజర్‌ మేస్రం కోశారావు పేటల్‌ అన్నారు. గురువారం మండలంలోని ధనోర ఆదివాసీ గ్రామంలో ఆర్థిక అక్షరా స్యతపై నాబార్డు సౌజన్యంతో ఆవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాలన్నారు. బ్యాంకులో పొదుపు, రుణాలు, ఇన్సూరెన్స్‌ పథకా లను ఖాతాదారులు సద్వినియోగించుకోవాలని నాబార్డు అధికారి రాంరెడ్డి అన్నారు. బ్యాంకు పథకాలు,సైబర్‌ నేరాలపై కళాజాతా బృందం సభ్యుడు రమేష్‌ వివరించారు. కళాజాతా ద్వారా ప్రజలకు బ్యాంకు సేవపై అవగాహన కల్పించారు. సర్పంచ్‌ మెస్రంభూపతి, సొసైటీసీఈవో కనకరమేష్‌ పాల్గొన్నారు.

Read more