Queen Elizabeth II Funeral : జో బైడెన్ను ఎగతాళి చేసిన డొనాల్డ్ ట్రంప్
ABN , First Publish Date - 2022-09-20T22:47:30+05:30 IST
మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియల సందర్భంగా అమెరికా
వాషింగ్టన్ : బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కు సరైన గౌరవం లభించలేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మండిపడ్డారు. బైడెన్కు 14వ వరుసలో సీటును కేటాయించడంపై వ్యంగ్యంగా స్పందిస్తూ, ‘ఉన్న చోటు ముఖ్యం’ అన్నారు. రెండేళ్లలో ఈ మార్పు వచ్చిందన్నారు.
క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు సెప్టెంబరు 19న లండన్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నేతలు, యూరోపియన్ ఫ్యామిటీ మెంబర్స్ హాజరయ్యారు. బ్రిటన్ను సుదీర్ఘ కాలం మహారాణిగా పరిపాలించిన ఎలిజబెత్-2కు తుది వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు 14వ వరుసలో సీటును కేటాయించారు.
ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ (Truth Social)లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘కేవలం రెండేళ్ళలో అమెరికాకు జరిగినది ఇది. గౌరవం లేదు’’ అని పేర్కొన్నారు. రాజకీయాలు, జీవితంలో మాదిరిగానే రియల్ ఎస్టేట్లో కూడా ఉన్న చోటు ముఖ్యం అన్నారు.
క్వీన్ ఎలిజబెత్ -2 సెప్టెంబరు 8న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమెకు నివాళులర్పించేందుకు జో బైడెన్, తన సతీమణి జిల్తో కలిసి లండన్ వెళ్ళారు.