క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తించాలి

ABN , First Publish Date - 2022-06-29T06:27:40+05:30 IST

క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తించాలి

క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తించాలి
పట్లూర్‌లో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు పూజలు నిర్వహిస్తున్న డీఆర్‌డీఏ పీడీ కృష్ణన్‌

 మర్పల్ల్లి, జూన్‌ 28: ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణానికి స్థలాన్ని గుర్తించాలని, హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అంతా సిద్ధం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ కృష్ణన్‌ పేర్కొన్నారు. మంగళవారం పట్లూర్‌ గ్రామాన్ని సందర్శించి క్రీడా ప్రాంగణం ఏర్పాటు స్థలంలో పూజలు నిర్వహించారు. వర్షాలు రానున్న రోజుల్లో ముమ్మరంగా కురుస్తాయని మొక్కలు నాటించేందుకు గుంతలు సిద్దం చేసి మండలంలో 5 లక్షల మొక్కలు నాటేందుకు సిద్దం చేయాలన్నారు. సర్పంచ్‌ ఇందిర ఆశోక్‌, ఏపీవో అంజిరెడ్డి, టీఏ విష్ణు, గ్రామ పాలకవర్గం సభ్యులు, పలు శాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - 2022-06-29T06:27:40+05:30 IST