రంగులు మారిన వాటర్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2021-01-22T06:01:51+05:30 IST

మద్దికెర మండలం పెరవలిలో వాటర్‌ప్లాంట్‌కు రంగులు మార్చడంతో మనస్తాపం చెందిన దాత తాళం వేశారు.

రంగులు మారిన వాటర్‌ ప్లాంట్‌

  1.  మనస్తాపంతో తాళం వేసిన దాత


మద్దికెర, జనవరి 21: మద్దికెర మండలం పెరవలిలో వాటర్‌ప్లాంట్‌కు రంగులు మార్చడంతో మనస్తాపం చెందిన దాత తాళం వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత నీరు అందించాలన్న ఉద్దేశంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.2కే 20 లీటర్లు ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో మాజీ జడ్పీటీసీ పురుషోత్తంచౌదరి అన్న కుమా రుడు హైదరాబాద్‌కు చెందిన ఇన్‌ఫార్‌ కంపెనీ యజమాని పోతుల రంగస్వామి తన సొంత డబ్బులు వెచ్చించి 5 ఎన్టీఆర్‌ సుజలస్రవంతి వాటర్‌ప్లాంట్లను నెలకొల్పారు. ఆ రోజు నుంచి రూ.2కే బిందెనీరు ఇస్తున్నారు. అయితే పంచాయతీ అధికారులు వైసీపీ నాయకుల ఒత్తిడితో ఈనెల 18న వాటర్‌ప్లాంట్లకు ఉన్న ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు బొమ్మలను, రంగులను తొలగించి తెల్లరంగులు వేశారు. దీంతో దాత మనస్తాపం చెంది వాటర్‌ప్లాంట్లకు తాళం వేయించారు. 

Updated Date - 2021-01-22T06:01:51+05:30 IST