15 రోజుల పాటు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు

ABN , First Publish Date - 2021-04-19T14:58:38+05:30 IST

దేశ ప్రజలందరనీ కరోనా కలవరానికి గురిచేస్తోంది.

15 రోజుల పాటు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు

న్యూఢిల్లీ: దేశ ప్రజలందరనీ కరోనా కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపధ్యంలో రాజస్థాన్ సర్కారు లాక్‌డౌన్ వ్యవధిని పెంచింది. దీనికి సంబంధించిన నూతన గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలుచేస్తోంది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోగల దుకాణాలను, మార్కెట్లను సాయంత్రం 5 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కర్ఫ్యూ ఏప్రిల్ 30 వరకూ కొనసాగనుంది. అయితే ఇప్పుడు ఈ కర్ఫ్యూ కాలాన్ని మే 3 వరకూ పెంచారు. 



Updated Date - 2021-04-19T14:58:38+05:30 IST