రాపూరులో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-04-24T03:20:59+05:30 IST

రాపూరులో శుక్రవారం వ్యాపారులు దుకాణాలను మూసివేసి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో కర్ఫూ వాతావరణం నెలకొనింది

రాపూరులో స్వచ్ఛంద లాక్‌డౌన్‌
రాపూరులో మూతపడిన దుకాణాలు

రాపూరు, ఏప్రిల్‌ 23: రాపూరులో  శుక్రవారం వ్యాపారులు దుకాణాలను మూసివేసి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో కర్ఫూ వాతావరణం నెలకొనింది. మండలంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో మధ్యాహ్నం 2గంటల నుంచి దుకాణాలు మూసివేయాలని నిర్ణయించుకున్నారు. ఎస్సై క్రాంతికుమార్‌ పచ్చజెండా ఊపడంతో శుక్రవారం దుకాణాలను బంద్‌చేశారు. ఆర్టీసీ బస్టాండు ప్రధాన రహదారిలో మాత్రం చిన్న చిన్న దుకాణాలు మాత్రం తెరిచారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వ్యాపారులు తప్పనిసరిగా కొవిడ్‌ నియమాలను పాటించాలన్నారు.

Updated Date - 2021-04-24T03:20:59+05:30 IST