అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం!
ABN , First Publish Date - 2022-07-03T09:16:51+05:30 IST
అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం!
ఏలూరు రూరల్, జూలై 2: సచివాలయం అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని సచివాలయానికి తాళం వేసిన ఉదంతమిది. ఏలూరు జిల్లా కేంద్రం వెంకటాపురం సుంకరవారితోటలోని రామ్నగర్ సచివాలయం-2 కోసం ఒక వ్యక్తి తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. ఆరు నెలలుగా అద్దె అడుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం సచివాలయానికి తాళం వేశాడు. శనివారం నాటికి కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో సచివాలయ సిబ్బందితో పాటు పనుల నిమిత్తం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.