జూలై 10న లోక్ అదాలత్
ABN , First Publish Date - 2021-06-22T05:14:08+05:30 IST
జిల్లాలోని అన్ని కోర్టులలో రాజీ చేసుకోదగిన కేసులను సత్వరం పరిష్కరించేందుకు జూలై 10న జాతీయ లోక్ అదాలత్ నిర్వ హిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు చెప్పారు.
ఏలూరు క్రైం, జూన్ 21 : జిల్లాలోని అన్ని కోర్టులలో రాజీ చేసుకోదగిన కేసులను సత్వరం పరిష్కరించేందుకు జూలై 10న జాతీయ లోక్ అదాలత్ నిర్వ హిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు చెప్పారు. పెండింగ్లో వున్న సివిల్, క్రిమినల్ కేసులలో రాజీ చేసుకోదగిన కేసులు, బ్యాంకు రుణాలు, వివాహ సంబంధిత కేసులు, రెవెన్యూ, ఎలక్ర్టిసిటీ, మోటారు వాహన ప్రమాద నష్ట పరిహార కేసులు చట్ట ప్రకారం రాజీ చేసుకోదగిన అన్ని రకాల క్రిమినల్ కేసులు పరిష్కారం నిమిత్తం ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు, భీమవరం, నరసా పురం, కొవ్వూరు, తణుకు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు కోర్టులలో జరుగు తుందని తెలిపారు.