Lok Sabha: మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ABN , First Publish Date - 2021-07-19T17:38:43+05:30 IST

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్షసభ్యుల ఆందోళనతో స్పీకర్‌

Lok Sabha: మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్షసభ్యుల ఆందోళనతో స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభకు వాయిదా వేశారు.  అంతకుముందు పార్లమెంట్‌లో కొత్త మంత్రులను సభకు ప్రధాని మోదీ పరిచయం చేశారు. ఎక్కువమంది ఎస్సీలు, మహిళలు మంత్రులు కావడం శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. కేబినెట్‌లో అన్నివర్గాలకు సామాజిక న్యాయం చేశామని తెలిపారు. లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రతిపక్షాల అభ్యంతరం వ్యక్తం చేశారు. చమురు ధరల పెంపుపై చర్చకు కాంగ్రెస్‌ ఎంపీల డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకింగా ఆప్‌ వాయిదా తీర్మానం ఇచ్చారు. 

Updated Date - 2021-07-19T17:38:43+05:30 IST