లోకేశ్‌పై కక్షతో విద్యార్థులను హింసించకండి

ABN , First Publish Date - 2021-06-17T06:25:13+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పైౖ ఉన్న కక్షతో విద్యార్థులను హింసించకండి అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురే్‌షకు బుధవారం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రావణ్‌ రాసిన లేఖలో పేర్కొన్నారు.

లోకేశ్‌పై కక్షతో విద్యార్థులను హింసించకండి

విద్యాశాఖ మంత్రికి తెలుగు యువత లేఖ

విద్యాధరపురం, జూన్‌ 16 :  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పైౖ ఉన్న కక్షతో విద్యార్థులను హింసించకండి అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురే్‌షకు బుధవారం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రావణ్‌ రాసిన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల మనోభావాలతో ఆడుకొని, పైశాచిక ఆనందం పొందుతోందని తెలిపారు. పరీక్షల విషయంలో మొండిగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ప్రజలు కోలుకుంటున్న సమయంలో ఒకసారి పరీక్షలు పెడతామని, మరోసారి పెట్టమని విద్యాశాఖ మంత్రి చెప్పడంతో గందరగోళం ఏర్పడుతోందని అన్నారు. 


Updated Date - 2021-06-17T06:25:13+05:30 IST