వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన Lokesh

ABN , First Publish Date - 2022-06-04T21:33:44+05:30 IST

వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. ఇంత దరిద్ర, అరాచ‌క‌ పాలన చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు.

వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన Lokesh

అమరావతి: వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. ఇంత దరిద్ర, అరాచ‌క‌ పాలన చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఖరికి పదో తరగతి ఫలితాల విడుదలలో కూడా రాజకీయమా? అని ప్రశ్నించారు. మంత్రికి సమాచారం లేదని ఫలితాల తేదీని అకస్మాత్తుగా వాయిదా వేస్తారా అని నిలదీశారు. పిల్లల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోందని దుయ్యబట్టారు. ఇంతకీ వాయిదా వేసింది మంత్రిగారు అలిగారనా?.. లేక ఫలితాల్లో జగన్ మార్క్ మార్కుల‌ మార్పుల కోసమా? అని లోకేష్‌ ప్రశ్నించారు.

Updated Date - 2022-06-04T21:33:44+05:30 IST