దేవినేని ఉమపై రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగించారు: నారా లోకేష్
ABN , First Publish Date - 2021-07-28T17:07:04+05:30 IST
దేవినేని ఉమపై సీఎం జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగించారని నారా లోకేష్ అన్నారు.
అమరావతి: టీడీపీ నేత దేవినేని ఉమపై సీఎం జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడ్డవారిని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు... బాధితులను నిందితుల్ని చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఉండడం దురదృష్టమన్నారు. మాజీమంత్రి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అన్యాయంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.