మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన
ABN , First Publish Date - 2022-04-07T01:58:21+05:30 IST
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు నారా
మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు నారా లోకేశ్ పర్యటించారు. కురగల్లు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను లోకేశ్ తెలుసుకున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు న్యాయ సహాయం అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పెంచిన కరెంట్ ఛార్జీలకు నిరసనగా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలను ఆయన పంచారు. ప్రభుత్వం వసూలు చేస్తున్న వివిధ పన్నులపై కరపత్రాలను ఆయన పంచారు. కరెంట్ పోవడంతో లాంతర్ చేతబట్టి గ్రామంలో లోకేష్ తిరిగారు.