విజయ్‌ మాల్యాకు భారీ షాకిచ్చిన లండన్‌ కోర్టు

ABN , First Publish Date - 2021-07-27T03:28:27+05:30 IST

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాకిచ్చింది. మాల్యా దివాలా తీసినట్టు కోర్టు ప్రకటించింది. అయితే ఈ తీర్పును భారతీయ బ్యాంకులకు అనుకూలంగా ఉందంటూ ఆర్థిక నిపుణులు అంటున్నారు.

విజయ్‌ మాల్యాకు భారీ షాకిచ్చిన లండన్‌ కోర్టు

లండన్: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాకిచ్చింది. మాల్యా దివాలా తీసినట్టు కోర్టు ప్రకటించింది. అయితే ఈ తీర్పును భారతీయ బ్యాంకులకు అనుకూలంగా ఉందంటూ ఆర్థిక నిపుణులు అంటున్నారు. మాల్యా ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తైనట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అంతలోనే మాల్యాను దివాలా తీసినట్లు లండన్ కోర్టు ప్రకటించడం గమనార్హం. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం భారత బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 9 వేల కోట్ల రుణాలకు సంబంధించి విజయ్ మాల్యా మోసం, మనీ ల్యాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2021-07-27T03:28:27+05:30 IST