ఏకాంతంగా నరసింహస్వామి కల్యాణోత్సవం
ABN , First Publish Date - 2021-06-22T04:58:59+05:30 IST
గుర్రంకొండ మండలం తరిగొండలో కొలు వైన లక్ష్మీనరసిం హస్వామి ఆలయంలో సోమవారం స్వామి వారి కల్యాణోత్స వాన్ని వేదపండితులు ఏకాం తంగా నిర్వహిం చారు.
గుర్రంకొండ, జూన్ 21: గుర్రంకొండ మండలం తరిగొండలో కొలు వైన లక్ష్మీనరసిం హస్వామి ఆలయంలో సోమవారం స్వామి వారి కల్యాణోత్స వాన్ని వేదపండితులు ఏకాం తంగా నిర్వహిం చారు. ఉదయాన్నే స్వామి వారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, తోమాలసేవ, అర్చన, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి కళ్యాణోత్సవాన్ని శ్రీదేవి, భూదేవిలతో ఏకాంతంగా చేశారు. భక్తులు అధికంగా తరలివచ్చారు.