జగన్మోహినిగా..శ్రీవారు!
ABN , First Publish Date - 2022-05-16T05:46:24+05:30 IST
జగన్మోహినిగా..శ్రీవారు!
ద్వారకాతిరుమల, మే 15: అపురూప లావణ్యాలను ఒలికిస్తూ..మోహినీ అలం కారంలో శ్రీవారు ఆదివారం భక్తజనులకు దర్శనమిచ్చారు. చినవెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముగ్ద మనోహర రూప లావణ్యాలతో జగన్మోహినిగా భక్తులను కటాక్షించారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృ తాన్ని దేవ, దానవులకు పంచేందుకు శ్రీమహావిష్ణువు స్త్రీ రూపంలోకి మారిన ఈ అలంకరణను అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తరించారు.