లారీ రివర్స్ చేస్తుండగా పెద్ద సౌండ్.. కిందకు దిగి చూసి షాక్.. ఆ డ్రైవర్ నిర్లక్ష్యం..!

ABN , First Publish Date - 2022-02-05T18:59:04+05:30 IST

నిర్లక్ష్యం నిండు ప్రాణం తీసింది.. డ్రైవర్ అజాగ్రత్త ఓ మనిషిని బలితీసుకుంది..

లారీ రివర్స్ చేస్తుండగా పెద్ద సౌండ్.. కిందకు దిగి చూసి షాక్.. ఆ డ్రైవర్ నిర్లక్ష్యం..!

నిర్లక్ష్యం నిండు ప్రాణం తీసింది.. డ్రైవర్ అజాగ్రత్త ఓ మనిషిని బలితీసుకుంది.. ఫ్లై ఓవర్ నిర్మాణ ప్రాంతంలో ఉన్న లారీని అర్ధరాత్రి సమయంలో డ్రైవర్ రివర్స్ చేయడానికి ప్రయత్నించాడు.. ఆ లారీ వెనక్కి వస్తూ మంచం మీద నిద్రపోతున్న ఓ వ్యక్తి మీదకు ఎక్కేసింది.. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే హాస్పిటల్‌కు తరలించినా ఫలితం లేకపోయింది.. మార్గమధ్యంలోనే అతను కన్నుమూశాడు.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


జోధ్‌పూర్‌కు సమీపంలోని కప్రాడా ప్రాంతంలోని హైవేపై ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. అక్కడ బలరామ్ ప్రజాపతి అనే వ్యక్తి గార్డుగా పనిచేస్తున్నాడు.. డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడే ఓ మంచం వేసుకుని నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో అక్కడే ఉన్న ఓ లారీని రివర్స్ చేయడానికి ప్రయత్నించిన డ్రైవర్ బలరామ్‌ను చూసుకోలేదు. నేరుగా బలరామ్ పైకి లారీని ఎక్కించేశాడు. 


ఆ ఘటనలో బలరామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతణ్ని హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో బలరామ్ మార్గమధ్యంలోనే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-02-05T18:59:04+05:30 IST