నష్టపోయిన రైతుల కోసం కోటి విరాళం
ABN , First Publish Date - 2020-11-30T04:58:19+05:30 IST
తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతుల కోసం తాను కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాని ప్రొద్దుటూరు శానససభ్యుడు రాచమల్లు శివప్రసా ద్రెడ్డి పేర్కొన్నారు.
రాజుపాళెం, నవంబరు 29 : తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతుల కోసం తాను కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాని ప్రొద్దుటూరు శానససభ్యుడు రాచమల్లు శివప్రసా ద్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన దెబ్బతిన్న వరి, శనగ, మినుము పంటలను పరి శీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ వైద్యం, విద్యతో పాటు రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, నష్టపోయిన రైౖతులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహాంతో పాటు అదనంగా ఇచ్చేందుకు తనకు వచ్చే నెల జీతం 2లక్షలతో పాటు తనకు అలవెన్సు రూపంలో వచ్చే మొత్తం కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏవో అమరనాధరెడ్డి, తహసీల్దారు ఉదయభారతి, నాయకులు నారాయణరెడ్డి, గోవర్ధనరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, రాజారామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.