లోవ ఆదాయం రూ.5.70 లక్షలు
ABN , First Publish Date - 2021-03-01T05:56:54+05:30 IST
తుని రూరల్, ఫిబ్రవరి 28: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని ఇరవై వేలమందికి పైగా భక్తులు దర్శిం
తుని రూరల్, ఫిబ్రవరి 28: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని ఇరవై వేలమందికి పైగా భక్తులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.5.70 లక్షల ఆదాయం సమకూరినట్టు ఈవో విశ్వనాధరాజు తెలిపారు.