ప్రేమ పెళ్లిపై ఏడాదిగా వివాదం.. గొడవలకు దిగుతున్న యువతి బంధువులు... నిర్మానుష్య ప్రదేశంలో యువకుని తల్లిదండ్రులు కనిపించడంతో...

ABN , First Publish Date - 2021-10-12T18:10:57+05:30 IST

ప్రేమికులపై పెద్దలు దాడిచేయడం, వారిని హతమార్చడంలాంటి...

ప్రేమ పెళ్లిపై ఏడాదిగా వివాదం.. గొడవలకు దిగుతున్న యువతి బంధువులు... నిర్మానుష్య ప్రదేశంలో యువకుని తల్లిదండ్రులు కనిపించడంతో...

ప్రేమికులపై పెద్దలు దాడిచేయడం, వారిని హతమార్చడంలాంటి సంఘటనలు తరచూ వినిపిస్తుంటాయి. ఇటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ జరిగిన ఘటనలో ప్రేమికుని తండ్రి బలయ్యాడు. తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకున్నదని ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు యువకుని కుటుంబ సభ్యులపై పగ పెంచుకుని, ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ ఘటనలో ప్రేమికుని తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రేమికుని తండ్రి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరమ్పూర్ చౌదరి గ్రామంలో చోటుచేసుకుంది. 


గ్రామానికి చెందిన సర్వర్ ఖాన్ అనే వ్యక్తి తన భార్యతో పాటు పశువులను మేపేందుకు పొలానికి వెళ్లాడు. ఇంతలో గ్రామానికి చెందిన కొందరు అతనిపై కర్రలతో దాడి చేశారు. దీంతో అతను స్పృహతప్పి పడిపోయాడు. ఈ ఘటనలో అతని కాలికి తీవ్రగాయమైంది. అలాగే అతని భార్యకు కూడా తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సర్వర్ ఖాన్ మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సర్వర్ ఖాన్ కుమారుడు మిస్రయర్ గ్రామానికి చెందిన ఒక యువతిని ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై ఆ యువతి తరపువారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే సర్వర్ ఖాన్‌పై దాడి జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-12T18:10:57+05:30 IST