బీరువాలో దాచిన రూ.60 లక్షల విలువైన బంగారం మాయం.. కూతురిని నిలదీస్తే బయటపడిన షాకింగ్ విషయాలు..

ABN , First Publish Date - 2022-04-13T20:24:09+05:30 IST

ఆమె తన బంధువుల వివాహానికి వెళ్లే సమయంలో బంగారం కోసం బీరువా తెరిచింది..

బీరువాలో దాచిన రూ.60 లక్షల విలువైన బంగారం మాయం.. కూతురిని నిలదీస్తే బయటపడిన షాకింగ్ విషయాలు..

ఆమె తన బంధువుల వివాహానికి వెళ్లే సమయంలో బంగారం కోసం బీరువా తెరిచింది.. లాకర్ తెరిచి చూస్తే మొత్తం ఖాళీగా ఉంది.. ముగ్గురు పిల్లలను విచారించగా 16 ఏళ్ల చిన్న కూతురు షాకింగ్ విషయం బయటపెట్టింది.. మొత్తం 1370 గ్రాముల బంగారాన్ని తన ప్రియుడికి ఇచ్చానని చెప్పింది.. అంతేకాదు తనపై గతంలో సామూహిక అత్యాచారం జరిగినట్టు కూడా తల్లికి చెప్పింది.. షాకైన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త చిన్న కూతురు పదో తరగతి చదువుతోంది. ఆమె రాజ్ (అసలు పేరు కాదు) అనే వ్యక్తితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ బాలికను రాజ్ పలుసార్లు అత్యాచారం చేశాడు. రాజ్ మాత్రమే కాదు.. అతని స్నేహితులు కూడా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్ది రోజుల అనంతరం ఉద్యోగం కోసం అని చెప్పి రాజ్ బెంగళూరుకు మకాం మార్చాడు. ఈ క్రమంలో పెళ్లి కోసం రాజ్‌పై ఆ బాలిక ఒత్తిడి చేసింది. దాంతో రాజ్ బెంగళూరులో ఫ్లాట్ కొన్న తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పాడు. 


ఫ్లాట్ కొనేందుకు తను సహాయం చేస్తానని చెప్పి తన ఇంట్లో ఉన్న 1.3 కేజీల బంగారాన్ని ఆ బాలిక రాజ్‌కు ఇచ్చింది. ఆ బంగారం విలువ రూ.60 లక్షలు ఉంటుంది. బంగారం తీసుకుని వెళ్లిన రాజ్ మళ్లీ ఆ బాలికకు కనిపించలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు. దీంతో ఆ బాలిక ఎవరికీ విషయం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. బంగారం పోయినట్టు తల్లి గుర్తించడంతో అసలు విషయం చెప్పింది. దీంతో రాజ్, అతని స్నేహితులపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Updated Date - 2022-04-13T20:24:09+05:30 IST