ప్రేమకోసం ఇల్లు వదిలి ప్రియుడితో పారిపోయిన యువతి.. ఆమెను ప్రియుడు ఎక్కడికి తీసుకెళ్లాడంటే..

ABN , First Publish Date - 2022-04-18T08:15:38+05:30 IST

ఆమె ఓ యువకుడితో ప్రేమలో పడింది.. అతడితో కలిసి జీవించాలనుకుంది.. అతడి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయింది.. తనను నమ్మి వచ్చిన ప్రేయసిని ఆ యువకుడు దారుణంగా మోసం చేశాడు.. ఆమెను ఓ వేశ్యా వాటికకు అమ్మేశాడు.. అప్పట్నుంచి ఆ యువతి అక్కడే మగ్గిపోయింది..

ప్రేమకోసం ఇల్లు వదిలి ప్రియుడితో పారిపోయిన యువతి.. ఆమెను ప్రియుడు ఎక్కడికి తీసుకెళ్లాడంటే..

ఆమె ఓ యువకుడితో ప్రేమలో పడింది.. అతడితో కలిసి జీవించాలనుకుంది.. అతడి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయింది.. తనను నమ్మి వచ్చిన ప్రేయసిని ఆ యువకుడు దారుణంగా మోసం చేశాడు.. ఆమెను ఓ వేశ్యా వాటికకు అమ్మేశాడు.. అప్పట్నుంచి ఆ యువతి అక్కడే మగ్గిపోయింది.. ఇటీవల పోలీసులు పట్టుకోవడంతో ఆమె కథ బయటకు వచ్చింది. 


బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. రౌతాబజార్ రెడ్ లైట్ ఏరియాలో ఓ యువతి చేత బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని విడిపించారు. అప్పుడు ఆ యువతి తన గతం గురించి పోలీసులకు చెప్పింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆ యువతికి ఓ యువకుడు ప్రేమ పేరుతో వల వేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. 


ఆమెను నేరుగా ఢిల్లీ తీసుకెళ్లి వేశ్యా వాటికను నిర్వహించి ఓ వ్యక్తికి అమ్మేశాడు. ఆ వ్యక్తి ఆమెను రౌతా బజార్ రెడ్ లైట్ ఏరియాకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆ యువతిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించాడు. ఆమెను ఎన్నో రకాలుగా హింసించారు. మూడేళ్లుగా ఆమెకు నరకం చూపిస్తున్నాడు. పోలీసుల సహకారంతో బాధితురాలు బయటపడింది. 

Updated Date - 2022-04-18T08:15:38+05:30 IST