Madhya Pradesh: భార్యకు తరచూ అతని నుంచి ఫోన్లు... అనుమానం వచ్చిన భర్త ఎంత దారుణానికి పాల్పడ్డాడంటే...
ABN , First Publish Date - 2022-07-24T14:37:40+05:30 IST
భార్య ప్రేమికుడిని హత్య చేసి, ఆ మృతదేహాన్ని...
భార్య ప్రేమికుడిని హత్య చేసి, ఆ మృతదేహాన్ని అడవిలో తగులబెట్టిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకుంది. నిందితుడు తన భార్య ప్రేమికుడిని ఫోన్లో వేధించేవాడని, ఆ తర్వాత అతనిని హత్య చేసేందుకు కుట్ర పన్నాడని సమాచారం. నిందితుడు తన భార్య ప్రేమికుడిని హత్య చేసి, మృతదేహాన్ని అడవిలో తగులబెట్టడమే కాకుండా అతని బైక్ను కాలువలో పడేశాడు. ఈ ఘటన మోవ్ తహసీల్ పరిధిలోని బార్గొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మంగ్లియా గ్రామంలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక యువకుడు ఈ మహిళతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడని, దీనిని గమనించిన ఆమె భర్త తన స్నేహితులతో కలిసి ఆ యువకుడిని హత్య చేసి, మృతదేహాన్ని అడవిలో తగలబెట్టాడు. అడవిలో గొర్రెల కాపరులు కాలిపోతున్న మృతదేహాన్ని చూసి, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించారు. మృతుడు కిషన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కట్ ఖేడీ గ్రామానికి చెందిన హన్స్రాజ్ చౌహాన్గా గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ (రూరల్) భగవత్ సింగ్ విర్దే మాట్లాడుతూ మృతుడు ఈ మహిళకు ఫోన్ చేసేవాడని, వారి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తెలిపారు. ఈ విషయం ఆ మహిళ భర్తకు తెలియడంతో స్నేహితులతో కలిసి అతనిని హత్య చేసి మృతదేహాన్ని తగులబెట్టాడని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామన్నారు.