Shocking : ప్రేమను నిరాకరించిందని ఆక్రోశంతో.. ప్రియురాలికి ఊహించని గిఫ్ట్.. పోలీసులకు ఫోన్ చేసి..!
ABN , First Publish Date - 2021-10-23T14:38:01+05:30 IST
ప్రేమను నిరాకరించిందని ప్రియురాలిపై...
హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ : ప్రేమను నిరాకరించిందని ప్రియురాలిపై కోపం పెంచుకున్నాడు. మూడు కిలోల గంజాయిని గిఫ్ట్గా ఇచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మూడేళ్ల నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. రైల్వే పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. వైజాగ్కు చెందిన వినయ్ కుమార్(26) ప్రైవేట్ ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె నిరాకరించింది. 2018 మే-31న యువతి హైదరాబాద్లో ఓ ఈవెంట్కు ఇద్దరు స్నేహితులతో హాజరైంది. విషయం తెలుసుకున్న వినయ్కుమార్ అదేరోజు సికింద్రాబాద్కు వచ్చాడు.
యువతి ఈవెంట్ ముగించుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు రాగానే వినయ్కుమార్ మూడు కిలోల గంజాయిని ప్యాక్ చేయించి గిఫ్ట్గా ఇచ్చాడు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రేమించనందుకు గిఫ్ట్ పేరుతో తనను వినయ్కుమార్ మోసం చేశాడని పోలీసులకు చెప్పింది. వారు వినయ్కుమార్ కోసం గాలిస్తుండగా మూడేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నెల 22న పోలీసులు వినయ్కుమార్కు ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పారు. ఆయన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్కు రాగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో రిమాండ్కు తరలించారు.