గరుడ పక్షిలా లక్నో సూపర్ జెయింట్స్ లోగో!
ABN , First Publish Date - 2022-02-01T02:03:57+05:30 IST
ఐపీఎల్ నయా ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) సోమవారం తన లోగోను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ..
న్యూఢిల్లీ: ఐపీఎల్ నయా ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) సోమవారం తన లోగోను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఫ్రాంచైజీ మాట్లాడుతూ.. భారతీయ పురాణాల నుంచి ప్రేరణగా తీసుకుని తమ బ్రాండ్ను రూపొందించినట్టు పేర్కొంది.
గరుడ పక్షి నుంచి స్ఫూర్తి పొంది లోగోలోని రెక్కలను రూపొందించినట్టు తెలిపింది. త్రివర్ణ పతాకంలోని మూడు రంగులను రెక్కలకు ఉపయోగించి పాన్ ఇండియా గుర్తింపు ఇచ్చారు. పక్షి శరీరాన్ని నీలం రంగు బ్యాట్తో చూపించారు. దానికి ఎరుపు రంగు బంతిని జోడించి ‘తిలకం’ అద్దినట్టుగా రూపొందించారు. మొత్తంగా లోగోను ఆకట్టుకునేలా రూపొందించారు.
లక్నో సూపర్ జెయింట్ జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. రూ. 17 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. అలాగే, మార్కస్ స్టోయినిస్ను రూ. 9.2 కోట్లు, రవి బిష్ణోయ్ను రూ. 4 కోట్లకు ఎల్ఎస్జీ సొంతం చేసుకుంది. కోచ్గా ఆండీ ఫ్లవర్ను ఎంచుకోగా, టీమిండియా మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ మెంటార్గా వ్యవహరిస్తాడు.