డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజనం
ABN , First Publish Date - 2021-03-06T05:24:53+05:30 IST
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం మధ్యా హ్న భోజన పథకాన్ని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంగం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి ప్రారంభించారు.
ఆదిలాబాద్టౌన్, మార్చి5: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం మధ్యా హ్న భోజన పథకాన్ని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంగం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ గతంలో పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలో ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. విద్యార్థుల చదువుతో పాటు భోజన సౌకర్యాన్ని ఏర్పాటుచేసి చదువుపై మరింత దృష్టి సారించేలా ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో ప్రిన్సిపాల్ ప్రతాప్సింగ్, అతికబేగం, వైస్ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.