నాలుగో రోజుకు చేరిన మధ్యాహ్న భోజన వర్కర్స్‌ సమ్మె

ABN , First Publish Date - 2021-10-24T06:30:29+05:30 IST

జిల్లాలో మధ్యాహ్న భోజనం వర్కర్స్‌ సమ్మె నా లుగో రోజుకు చేరుకుంది.

నాలుగో రోజుకు చేరిన మధ్యాహ్న భోజన వర్కర్స్‌ సమ్మె
మధ్యాహ్న భోజన వర్కర్లకు సంఘీభావంగా సమ్మెలో పాల్గొన్న నాయకులు

- సంఘీభావం ప్రకటించిన సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 23 : జిల్లాలో మధ్యాహ్న భోజనం వర్కర్స్‌ సమ్మె నా లుగో రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానం దం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి సునిల్‌ సందర్శించి కార్మికులకు ఉద్దేశించి మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కరువై ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కనీస వేతనాలు, హక్కులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్‌ల యూనియర్‌ కార్యదర్శి పూసాల రమేష్‌, ఓదెల రమేష్‌, రమాదేవి, పద్మ, సరోజ, స్వరూపరాణి, లక్ష్మీ, కల్వల పద్మ, ఎండి రజియా, సుమలత, వినోద తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T06:30:29+05:30 IST