పిచ్చి కుక్క కరిచి పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2021-01-16T06:10:07+05:30 IST

పట్టణంలో పిచ్చికుక్క కరిచి ఇద్దరు పిల్లలకు, 8 మంది పెద్దలకు గాయాలైన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది.

పిచ్చి కుక్క కరిచి పలువురికి గాయాలు


 ఎర్రగొండపాలెం, జనవరి 15  :  పట్టణంలో పిచ్చికుక్క కరిచి ఇద్దరు పిల్లలకు, 8 మంది  పెద్దలకు గాయాలైన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఎర్రగొండపాలెం స్టేట్‌బ్యాంక్‌ వీధిలో హర్షిత, నాగులమీరా, వెంకటేశ్వర్లు, మరో మహిళ, ఒక బాలుడిని కూడా పిచ్చికుక్క కరిచి గాయపరిచింది. కుక్కకాటుకు గురైన వ్యక్తులు భయంతో ఎర్రగొండపాలెం కమ్యూనిటి వైద్యశాలకు వెళ్లి యాంటిర్యాబిస్‌ ఇంజెక్షన్లు వేయించుకొన్నారు. 

Updated Date - 2021-01-16T06:10:07+05:30 IST