Madabhushi: మాడభూషికి ‘కీర్తి పురస్కారం’

ABN , First Publish Date - 2022-09-22T13:26:08+05:30 IST

మద్రాస్‌ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మాజీ అధ్యక్షుడు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌(Madabhushi Sampathkumar)కు పొట్టి శ్రీరాములు తెలుగు

Madabhushi: మాడభూషికి ‘కీర్తి పురస్కారం’

చెన్నై, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మద్రాస్‌ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మాజీ అధ్యక్షుడు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌(Madabhushi Sampathkumar)కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తి పురస్కారం’ ప్రదానం చేసింది. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్‌ బుద్ధా మురళి తదితరులు మాడభూషికి పురస్కారం ప్రదానం చేసి అభినందించారు.

Updated Date - 2022-09-22T13:26:08+05:30 IST