భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని.. మనస్తాపానికి గురై..

ABN , First Publish Date - 2020-08-07T17:28:01+05:30 IST

భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు శానిటైజర్‌లో..

భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని.. మనస్తాపానికి గురై..

మదనపల్లె(చిత్తూరు): భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు శానిటైజర్‌లో నెయిల్‌పాలీష్‌ కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వన్‌టౌన్‌ పోలీసుల కథనం మేరకు.. పట్టణ దిగువ కురవంకకు చెందిన లిఖిత్‌కుమార్‌(23)ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. లిఖిత్‌ భార్య బుధవారం పుట్టింటికి వెళ్లాలని భర్తతో గొడవపడింది. శనివారం కలసి వెళ్దామని చెప్పినా..ఆమె వినకుండా పుట్టిల్లు బెంగళూరుకు వెళ్లిపోయింది. దాంతో మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్యకు యత్నించాడు. అతనిని ఆటోలో జిల్లా వైద్యశాలకు తరలించారు.


Updated Date - 2020-08-07T17:28:01+05:30 IST