214 మద్యం సీసాల స్వాధీనం
ABN , First Publish Date - 2021-01-22T06:31:05+05:30 IST
నూజివీడులోని అమ్మవారితోటలో బైక్పై తరలి స్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు.
నూజివీడు రూరల్, జనవరి 21 : నూజివీడులోని అమ్మవారితోటలో బైక్పై తరలి స్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. కొత్తూరు గ్రామానికి చెందిన రాజులపాటి వెంకన్నబాబు అనే వ్యక్తి తెలంగాణకు చెందిన వెంకటేశ్వర రావు మద్యం సీసాలు అందజేశాడు. అమ్మవారితోటలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్న వెంకన్నబాబు, తెలంగాణ మద్యాన్ని విక్రయిస్తున్నట్టు సమా చారం రావడంతో దాడిచేసి సుమారు రూ.1.01 లక్షల, 214 మద్యం సీసాలు, బైక్ స్వాధీనం చేసుకుని వెంకన్నబాబుపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ వెంకటనారాయణ, ఎస్సై గణేష్కుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.