విద్యా దాతకు గ్రామస్థుల నివాళి

ABN , First Publish Date - 2020-08-08T09:31:48+05:30 IST

వీరవాసరంలో విద్యాసంస్థల ఏర్పాటు యావదాస్థిని దానం చేసిన మహానీయుడు మద్దాల రామకృష్ణమ్మకు గ్రామస్థులు ఘనంగా ..

విద్యా దాతకు గ్రామస్థుల నివాళి

వీరవాసరం, ఆగస్టు7: వీరవాసరంలో విద్యాసంస్థల ఏర్పాటు యావదాస్థిని దానం చేసిన మహానీయుడు మద్దాల రామకృష్ణమ్మకు గ్రామస్థులు ఘనంగా నివాళులర్పించారు. రామకృష్ణమ్మ వర్ధంతి సందర్భంగా శుక్రవారం బస్టాండ్‌ సెంటర్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేలాది మందికి విద్యాదానం చేయడమేకాక మండల కేంద్రంలో విద్యా సంస్థలు ఏర్పాటుచేసి ఎన్నో కుటుంబాలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించిన మహానీయుడని పలువురు పేర్కొన్నాడు.  మద్దాల శ్రీను, కూనపరెడ్డి జయరాజు, బండి శ్రీనివాసరావు, సిరాపు లక్ష్మణరావు, కేవీఎల్‌.నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2020-08-08T09:31:48+05:30 IST