హనుమద్ కల్యాణం
ABN , First Publish Date - 2022-05-27T06:07:17+05:30 IST
గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమద్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
జంగారెడ్డిగూడెం, మే 26 : గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమద్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఆలయ ముఖ మండపంలో శ్రీసువర్చలా హనుమద్ కల్యాణాన్ని ఆలయ ప్రధానార్చకులు, అర్చకులు, వేద పండితులు, ఋత్వికులు అత్యంత వైభవంగా నిర్వ హించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌక ర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కీసరి సరిత విజయ భాస్కరరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.