అత్తను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటో తీసుకొస్తానని మామకు చెప్పి వెళ్లి ఊహించని షాకిచ్చిన కొత్త కోడలు..!

ABN , First Publish Date - 2022-04-21T21:20:22+05:30 IST

ఆ యువకుడికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదు.. దీంతో కుటుంబ సభ్యులు మధ్యవర్తికి రూ.2 లక్షలు చెల్లించి పెళ్లి సంబంధం కుదిర్చారు..

అత్తను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటో తీసుకొస్తానని మామకు చెప్పి వెళ్లి ఊహించని షాకిచ్చిన కొత్త కోడలు..!

ఆ యువకుడికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదు.. దీంతో కుటుంబ సభ్యులు మధ్యవర్తికి రూ.2 లక్షలు చెల్లించి పెళ్లి సంబంధం కుదిర్చారు.. వివాహం తర్వాత ఆమె అత్తింటికి వెళ్లింది.. వారం రోజుల్లోనే వారి అభిమానాన్ని చూరగొంది.. మంగళవారం ఉదయం భర్త ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత అత్త మామలకు టీ ఇచ్చింది.. ఆ టీ తాగి అత్త స్పృహ కోల్పోయింది.. అత్తను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటో తీసుకొస్తానని మామకు చెప్పి కోడలు బయటకు వెళ్లింది.. ఎంత సేపటికీ తిరిగి రాలేదు. చివరకు వారికి అసలు విషయం తెలిసింది. 


మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌కు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి ఆర్తి అనే మహిళతో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే ఆర్తి అత్తింటి వారికి బాగా చేరువైంది. అందరూ ఆమెను అభిమానించడం ప్రారంభించారు. మంగళవారం ఉదయం ప్రవీణ్ ఆఫీస్‌కు వెళ్లినపుడు ఆర్తి టీలో మత్తు మందు కలిపి అత్త మామలకు ఇచ్చింది. ఆ టీ తాగిన తర్వాత అత్త స్పృహ కోల్పోయింది. దీంతో కంగారు పడిన ఆమె భర్త హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆర్తి ఆటో తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఎంత సేపటికీ తిరిగి రాలేదు. 


పక్కింటి వారి సహాయంతో బాధితులిద్దరూ హాస్పిటల్‌కు చేరారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకుని ఇంటికి వెళ్లిన ప్రవీణ్‌కు షాక్ తగిలింది. ఇంట్లో ఉండాల్సిన నగలు, డబ్బులు మాయమయ్యాయి. దీంతో ఆ దొంగ వధువు గురించి పోలీసులకు ప్రవీణ్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-04-21T21:20:22+05:30 IST