బతకాలని లేదంటూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. వీడియోలో తన భార్య గురించి చెప్పిన విషయాలు వింటే షాక్!

ABN , First Publish Date - 2021-12-25T17:50:59+05:30 IST

అతనికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.. శుక్రవారం మధ్యాహ్నాం తన భార్యతో కలిసి బయటకు వెళ్లాడు..

బతకాలని లేదంటూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. వీడియోలో తన భార్య గురించి చెప్పిన విషయాలు వింటే షాక్!

అతనికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.. శుక్రవారం మధ్యాహ్నాం తన భార్యతో కలిసి బయటకు వెళ్లాడు.. సాయంత్రం నాలుగు గంటలకు భార్యను ఇంటి దగ్గర దింపేసి తనొక్కడే బయటకు  వెళ్లాడు.. నేరుగా రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి వేగంగా దూసుకొస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆత్మహత్య చేసుకునే ముందు ఓ వీడియో షూట్ చేశాడు.. ఆ వీడియోలో తన భార్య గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


భోపాల్‌లోని పంపాపూర్ బస్తీలో గంగారామ్ జాతవ్ అనే వ్యక్తి తన భార్య షామిలితో కలిసి జీవిస్తున్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత గంగారామ్ చిన్ననాటి స్నేహితుడు నవీన్‌తో షామిలి వివాహేతర సంబంధం పెట్టుకుంది. గంగారామ్ ఎంత హెచ్చరించినా ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో నవీన్‌పై గంగారామ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టాడు. అయినా నవీన్, షామిలి వెనక్కి తగ్గలేదు. దీంతో గంగారామ్, షామిలి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం గంగారామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 


`పెళ్లి తర్వాతి నుంచి నా భార్య నన్ను ఎంతగానో వేధిస్తోంది. నా స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నన్ను వదిలేసి అతనితో వెళ్లిపోమ్మన్నా.. వెళ్లడం లేదు. నా ఇంట్లోనే ఉంటూ నా స్నేహితుడితో కలిసి తిరుగుతోంది. పోలీసులు హెచ్చరించినా వారు వినడం లేదు. ఈ విషయం మొత్తం హబీబ్ గంజ్ పోలీసులకు తెలుసు` అంటూ గంగారమ్ పేర్కొన్నాడు. కాగా, గంగారామ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-12-25T17:50:59+05:30 IST